అక్కినేని అఖిల్ హీరోగా చేసిన అఖిల్, హలో సినిమాలు చేశాడు. ప్రస్తుతం 3వ సినిమా మిస్టర్ మజ్ ను సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ తన 4వ సినిమాకు మెగా సపోర్ట్ ఉండనుందని తెలుస్తుంది.


మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతగా అఖిల్ హీరోగా సినిమా ఉంటుందట. ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీను పనిచేస్తాడట. ప్రస్తుతం రాం చరణ్ హీరోగా వినయ విధేయ రామా సినిమా చేస్తున్నాడు రాం చరణ్. ఈ సినిమా తర్వాత మళ్లీ రాం చరణ్ నిర్మాణంలో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందట.


నాగార్జున ప్లానింగ్ ప్రకారమే ఈ కాంబో కుదిరిందట. మెగా అస్త్రంతో వస్తున్న అఖిల్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి. హీరోగా ఓ పక్క సూపర్ ఫాంలో ఉన్న రాం చరణ్ నిర్మాతగా కూడా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమా నిర్మిస్తున్న రాం చరణ్ ఆ సినిమా తర్వాత చిరంజీవి, కొరటాల శివ మూవీని నిర్మిస్తాడని తెలుస్తుంది. 


ఇక మరో పక్క రాం చరణ్ హీరోగా వినయ విధేయ రామా పూర్తి కాగానే ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. హీరోగా నిర్మాతగా రెండిటిలో రాం చరణ్ తన సత్తా చాటుతున్నాడని చెప్పొచ్చు. చరణ్, అఖిల్, బోయపాటి ఈ కాంబినేషన్ మీద మాత్రం మెగా, అక్కినేని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: