మెగా ఫ్యామిలీ వీరాభిమాని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలోకి వచ్చిన నేపధ్యంలో అతడు తరుచు మీడియా ఛానల్స్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ఈ మెగా కాంపౌండ్ వీరాభిమాని త్వరలో జరగబోతున్న తెలంగాణ రాష్ట్రా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తాను బ్లేడ్‌ తో కోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
అత్యుత్సాహంతో బండ్ల
ఇప్పుడు ఈ కామెంట్స్ పై నటుడు పృథ్వీ సవాల్ విసరడమే కాకుండా బండ్ల గణేష్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసాడు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బండ్ల గణేష్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. అంటూ తెలంగాణలో మహాకూటమి పరాజయం పాలైతే గొంతు కోసుకొంటాననడం సరైన పద్ధతి కాదు అంటూ పృథ్వీ బండ్ల గణేష్ కు సూచనలు ఇస్తున్నాడు. 
పోలీసులకు చెప్పాలి
అంతేకాదు సవాళ్లు ఉండాలి కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునే విధంగా ఉండకూడదు అని అంటూ వాస్తవానికి బండ్ల గణేష్ రాజకీయాలలోకి రావడమే ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు పృథ్వీ. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో కూడా ఫొటో తీయించుకునే సత్తా బండ్ల గణేష్ కు ఉంది అంటూ పృథ్వీ వేసిన సెటైర్లు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 
బండ్ల గణేష్ మంచి మిత్రుడు
మెగా కుటుంబానికి వీరాభిమాని పవన్ కు వీరభక్తుడు అయిన బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరినా కనీసం అతడు కోరుకున్న ఎమ్ ఎల్ ఎ టిక్కెట్ కూడ ఇవ్వకపోవడం ఈ మెగా నిర్మాతను అవమానించడమే అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థుతులలో ఈ మెగా భక్తుడు ఒకవేళ కాంగ్రెస్ ఎన్నికలలో ఓడిపోతే ఎలా వ్యవహరిస్తాడు అన్న విషయమై సాధారణ ప్రజానీకానికి కూడ బాగా ఆసక్తి పెరిగి పోతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: