రజిని, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ ఈ నెల 29న అనగా గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లైకా ప్రొడక్షన్స్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ రో నిర్మించబడిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ రేంజ్ లో ఉన్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్నా సరే తెలుగులో సినిమా ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు.


బాహుబలి రిలీజ్ టైంలో తెలుగులోనే కాదు తమిళ, హింది భాషల్లో కూడా రాజమౌళి అండ్ టీం చెక్కర్లు కొడుతూ బీభత్సమైన ప్రమోషన్స్ చేశారు. కేవలం తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి వల్లే సోమవారం సాయంత్రం 2.ఓ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఎరేంజ్ చేశారు. అది కూడా తూతూమంత్రంగానే చేశారు.


శంకర్, రజిని, అక్షయ్ కుమార్ తో పాటుగా తెలుగులో సినిమాను రిలీజ్ చేస్తున్న ఎన్వి ప్రసాద్, దిల్ రాజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవెంట్ లో కూడా రజినికాంత్ ఫ్లోలో అసలు ప్రమోషన్ అవసరం లేదు ఎన్వి ప్రసాద్ అనవసరంగా ఖర్చు పెడుతున్నాడని అన్నాడు. రజిని మాటల్లోని ఉద్దేశం ఏంటంటే సినిమాకు ఆల్రెడీ బజ్ ఏర్పడటం వల్ల ప్రమోషన్ అవసరం లేదని. 


అయితే ఆడియెన్స్ మాత్రం మరి తమిళంలో ప్రమోషన్స్ చేస్తున్నారు కదా అక్కడ ఎందుకు చేస్తున్న్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా రజినికాంత్ 2.ఓ సినిమా బాహుబలి రేంజ్ ప్రమోషన్స్ చేయడంలో మాత్రం విఫలమైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: