నిఖిల్ హీరోగా వచ్చిన యువత సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటిన పరశురాం అలియాస్ బుజ్జి ఆ తర్వాత ఆంజనేయులు, సోలో సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్నాడు. కెరియర్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన పరశురాం విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.   


అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్ ను డబుల్ చేస్తూ ఈ సినిమా హిట్ అతని కెరియర్ కు అదిరిపోయే క్రేజ్ తెచ్చింది. అయితే మధ్యలో ఓ సినిమా చేసినా ఆ సినిమా ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడలేదు. గీతా గోవిందం సినిమా కథ గొప్పగా లేకున్నా దర్శకుడు చాలా అద్భుతంగా సన్నివేశాలు రాసుకున్నాడు.


అందుకే ఆన్ స్క్రీన్ క్రెడిట్ విజయ్, రష్మికలదే అయినా ఆఫ్ స్క్రీన్ క్రెడిట్ మొత్తం పరశురాం కొట్టేశాడు. ఇక ఈ సినిమా హిట్ తర్వాత ఒకటి రెండు ప్రొడక్షన్స్ పరశురాం తర్వాత సినిమా తమతోనే అంటూ ఎనౌన్స్ చేశాయి. అయితే ఫైనల్ గా మళ్లీ పరశురాం బన్ని వాసు నిర్మాణంలోనే మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.


ఇప్పటికే కథ సిద్ధం అవగా ఆ కథకు తగిన హీరో మాత్రం దొరకడం లేదట. స్టార్ హీరోలు కాకున్నా మీడియం రేంజ్ హీరోలు పరశురాం కు కావాల్సి ఉంది. సాయి ధరం తేజ్ తో పరశురాం సినిమా ఉంటుందని వార్తలు రాగా ఈమధ్యనే కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి మొదలుపెట్టాడు తేజూ. అందుకే పరశురాం తో సినిమా ఛాన్స్ లేదని తెలుస్తుంది. తేజూనే కావాలి అనుకుంటే మాత్రం పరశురాం మరో ఆరు నెలలు వెయిట్ చేయక తప్పదు. మరి హిట్ సినిమా దర్శకుడికి హీరోలు కరువవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: