టాప్ హీరోల భారీ సినిమాలకు సంబంధించి ఆ సినిమాలు విడుదల కాకుండానే రివ్యూలు  ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తాను ఈమూవీని ఇప్పటికే చూసాను ఒక అద్భుతం అంటూ ట్విట్ చేయడమే కాకుండా ‘2.0’ ఒక విజువల్ వండర్ అంటూ ట్విట్ చేసిన కొద్ది గంటలకే ఆట్విట్ వైరల్ గా మారిపోయింది. అయితే వాస్తవానికి ఈమూవీని ఇప్పటికీ రజినీకాంత్ అక్షయ కుమార్ లు తాము ఇప్పటి వరకు పూర్తిగా చూడలేదు అంటూ నిన్న హైదరాబాద్ లో జరిగిన మీడియా మీట్ లో చెప్పిన కొద్ది గంటలకే ఉమైర్ సంధు ట్విట్ చేయడంతో అసలు ఈవార్తలు నిజమా లేక ఫేక్ న్యూస్ అనుకోవాలా అన్న చర్చలు జరుగుతున్నాయి.  
ఎవరు వీరంతా?
ఉమైర్ సంధూ మాటల ప్రకారం ‘2.0’ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అంటూ అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచాడు. అయితే అనూహ్యంగా ఈసినిమాకు రజినీకాంత్ భారీ పబ్లిసిటీ ఇష్టపడటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. 
2.0 ఒక విజువల్ వండర్
ఈ సినిమా టెక్నాలజీతో కూడిన మంచి సబ్జెక్ట్ అని అందుకే దీనికి ప్రచారం అక్కర్లేదని రజినీకాంత్ అంటున్న మాటలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ 600 కోట్ల సినిమాకు పబ్లిసిటీ లేకపోతే ఎలా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో రజినీకాంత్ కు ‘2.0’ ఫలితం పై ఉన్నది మితిమీరిన ఆత్మ విస్వాసమా లేకుంటే ఈసినిమా రిజల్ట్ గురించి రజినీకాంత్ కు కూడ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇలా అంచనాలు పెంచకుండా జాగ్రత్త పడుతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 కీలకంగా అమీ జాక్సన్ పాత్ర
ఇది ఇలా ఉంటే ఈమూవీలో రజినీకాంత్ తో సమానంగా అమీ జాక్సన్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని ఫస్ట్ పార్ట్ ‘రోబో’ లో మ్యూజియంకు పరిమితం చేసిన చిట్టి రోబోను బయటకు తీసుకురావడంలో అమీ జాక్సన్ పోషించే పాత్ర కీలకంగా ఉంటుందని ఆమె చిట్టికి సపోర్టుగా కొన్ని స్టంట్స్ ను కూడా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ‘2.0’ రిజల్ట్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ లేకుంటే ఫ్లాప్ మాత్రమే కానీ సాధారణ సినిమాలులా ఈమూవీకి ఏవరేజ్ టాక్ వచ్చే ఆస్కారం లేదు అన్న కామెంట్స్ ఫిలిం ఇండస్ట్రీ విశ్లేషకుల భావన.. 


మరింత సమాచారం తెలుసుకోండి: