సాధారణంగా అక్కినేని నాగేశ్వర రావు ఎవరిని తొందరగా మెచ్చుకోరు. ఆయన మనిషి జయాపజయాలను గుర్తించి ప్రశంసలు కురిపించరు. ఆ మనిషి ఫెయిల్ అయినా పర్వాలేదు. అతనిలోని పట్టుదల ఉంటే ఎప్పటికైనా విజయం సాధిస్తాడు, ఇదీ అక్కినేని వారి ఫిలాసఫీ. అది స్వయంగా ఆయనే చెప్పారు ఓ సందర్భంలో అటువంటి అక్కినేని వారికి ఈ తరం హీరోల్లోనూ నచ్చే మెచ్చే ఒక హీరో ఉన్నారట. అది చాలా లేట్ గా బయటపడింది.


సూపర్ స్టార్ క్రిష్ణ వారసునిగా సినిమా రంగంలోకి వచ్చిన మహేష్ బాబు తనను తాను ప్రూఫ్ చేసుకుని ఇపుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయన నటన గురించి చెప్పనవసరం లేదు. అద్భుతాలే పలికిస్తాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా మహేష్ ఖాతాలో ఉన్నాయి. మహేష్ బాబుకు ఉన్న అభిమాన గణం చాలా ఎక్కువ కూడా. ఆయనకు అన్ని వయసుల వారూ ఫ్యాన్స్ గానే ఉన్నారు.  మరి ఈ ఘట్టమనేని వారసుడు అక్కినేనికి నాగేశ్వరరావుకు కూడా నచ్చే హీరో గా ఉండడం గొప్ప విషయమే. మనిషిని లోతుల్లోంచి చూసి ప్రతిభకు మార్కులు వేసే అక్కినేని వారు మహేష్ లఒ ఏం చూశారో కానీ అభిమాని అయిపోయారట.


ఈ సంగతి ఆయన మనవడు సుమంత్ తాజాగా చెప్పుకొచ్చారు. పెద్దలను గౌరవించడం, అందరితో మంచిగా ఉండడం వంటి సుగుణాలే అక్కినేని వారిని  మహేష్ బాబు అభిమానిగా చేశాయట. 106 ఏళ్ళ పండు ముదుసలి మహేష్ అభిమాని గా ఉంటే అంతకంటే ఆశ్చర్యం ఉందా. మహేష్ ని చూడాలని ఉందని ఆ వ్రుధ్ధురాలు చెబితే మహేష్ అన్న మాట నేను నిన్ను చూడడం నా లక్ అని. మరి ఇంతలా పెద్దల పట్ల వినయం విధేయత కలిగిన మహేష్ గురించి ఆయన స్నేహితుడు, అక్కినేని హీరో సుమంత్ ట్వీట్ చేస్తూ మహేష్ గొప్ప నటుడే కాదు, గొప్ప సుగుణాల రాశి అని పొగిడారు. 


పెద్దలకు మీరు ఎంతో గౌరవంను ఇచ్చే హీరో - ఆ కారణం వల్లే ఈతరం హీరోల్లో మా తాతయ్య ఏయన్నార్ గారికి మీరు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది అంటూ ట్వీట్ చేశాడు. సుమంత్ ట్వీట్ కు మహేష్ బాబు స్పందించాడు. థ్యాంక్స్ సుమంత్ - ఏయన్నార్ గారు నాకు ఎప్పటికి ఆదర్శప్రాయులు అంటూ రీ ట్వీట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  మరి ఇపుడు కదా సూపర్ స్టార్ క్రిష్ణ గారు ఆనందపడతారు. అక్కినేని అంతటి పెద్దలు దీవెనలు తన కుమారుడు మహేష్ కి దక్కినందుకు మురిసిపోతారు.



మరింత సమాచారం తెలుసుకోండి: