ఈ మద్య ఇండస్ట్రీలో హర్రర్ కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రాలకు విపరీతమైన క్రేజ్ వస్తుంది. ఒకప్పుడు భయపెట్టే చిత్రాలంటే పెద్దగా పట్టించుకోని అభిమానులు ఈ మద్య ఇలాంటి చిత్రాలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక హర్రర్, కామెడీ, థ్రల్లర్ తో వచ్చే చిత్రాలు దాదాపు అన్నీ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి. రాగిణి ఎంఎంస్ ఫేం భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అమావాస్. నర్గీస్ ఫక్రీ, సచిన్జోషి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది.
ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మోనా జస్బీర్ సింగ్. అలీ అస్గర్ అగా, నవ్నీత్ కౌర్ దిల్లాన్, వివన్ బతేనా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం జనవరి 11,2019న విడుదల కానుంది.
తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హర్రర్ జోనర్ లో ఈ టీజర్ ను కట్ చేశారు.ఈ మధ్య సచిన్ జోషి చేసే సినిమాలన్నింటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అతి త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారు.