సూపర్ స్టార్ మహేష్ వంశ్రీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మహర్షి సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే మహర్షి సినిమా తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆ సినిమా ప్లాన్ చేస్తున్నారు. 


మహేష్, సుకుమార్ ఇద్దరు ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా నిరాశపరచింది. అంతేకాదు 14 రీల్స్ వారికి పెద్ద నష్టం మిగిల్చింది. అందుకే సుకుమార్ కథ విషయంలో మహేష్ కాంప్రమైజ్ అవడం లేదట. 1 నేనొక్కడినే తర్వాత నాన్నకు ప్రేమతో, రంగస్థలం హిట్లు అందుకున్నా సుకుమార్ మీద మహేష్ డౌట్ వీడలేదు.


ఈమధ్య సుకుమార్ చెప్పిన ఓ పిరియాడికల్ స్టోరీని మహేష్ వద్దనేశాడట. ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టిన సుకుమార్ వేరే కథ ట్రై చేస్తున్నాడట. అది కూడా మహేష్ కు నచ్చుతుందో లేదో అంటున్నారు. మహేష్ తో సుకుమార్ చేసే సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి ఆ అంచనాలను అందుకునే సబ్జెక్ట్ కావాలి.


అప్పటివరకు టైం అయినా తీసుకుంటే బెటర్ అంటున్నాడట మహేష్. అందుకే సుకుమార్ తో మహేష్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ 26వ సినిమా సుక్కు చేయాల్సి ఉంది. అతని ప్లేస్ లో అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ మహేష్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి ఈ కన్ ఫ్యూజన్ వీడాలంటే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: