తొలి సినిమా హిట్ అయితే వరస చాన్సులు వస్తాయి. ఆ విధంగా ఇపుడు ప్రియాంక జువాల్కర్ లక్కీ గర్ల్ అనిపించుకుంది. టాక్సీ వాలా మూవీ హిట్ తో ఆమెకు ఇపుడు ఏకంగా మాస్ మహారాజా రవితేజా సరసన నటించే చాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. రవితేజా చేసుకున్న కొత్త చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఇక కధానాయికగా ప్రియాంకను ఎంపిక చేయాలనుకుంటున్నారట. స్వయంగా రవితేజాయే ఆమెను సెలెక్ట్ చేసేందుకు మొగ్గు చూపారని టాక్.


ట్యాక్సీవాలా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రియాంక జవాల్కర్ కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. సక్సెస్ తో ఎంట్రీ ఇచ్చి లక్కీ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమెను తమ సినిమాలో ఎంపిక చేసేందుకు డిసైడ్ అయ్యారని అంటున్నారు. . మొదట ఈ చిత్రం కోసం పాయల్ రాజ్ పూత్ మరియు నభా నటేష్ లను ఎంపిక చేయడం జరిగింది. నన్ను దోచుకుందువటే చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ నభా నటేష్ కు తన సినిమాలో రవితేజ ఛాన్స్ ఇచ్చాడు.


అయితే ట్యాక్సీవాలా చిత్రం విడుదల తర్వాత తన నిర్ణయంను మార్చుకున్నాడని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రియాంక జవాల్కర్ కు ఇంకా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా దక్కుతున్నాయట. నిజానికి ఈ బ్యూటీకి అందంతో పాటు తగిన అభినయం కూడా ఉంది. పైగా మన అనంతపురానికి చెందిన తెలుగు అమ్మాయి కావడం ప్లస్ పాయింట్ గా ఉంది ప్రియాంక జోరు చూస్తూంటే తొందరలోనే తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా పేరు తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: