తెలుగు ఇండస్ట్రీలో నాగశౌర్య నటించిన ‘ఛలో’చిత్రంలో పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన.  ఈ చిత్రం మంచి హిట్ కావడంతో గీతా ఆర్ట్స్ లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’చిత్రంతో మరో అద్భుతమైన విజయం అందుకుంది.  ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో రష్మిక కు వరుసగా ఛాన్స్ లు రావడం మొదలయ్యాయి.  నాగార్జున, నాని మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’చిత్రం కూడా మంచి పేరు తీసుకు వచ్చింది.  ఇక దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.  

Image result for atlee vijay

వాస్తవానికి ఈ చిత్రంపై వివాదాలు చుట్టుముట్టాయి..కానీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది.  ప్రస్తుతం  అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక చిత్రం చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మెర్సల్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ కాంబినేషన్ మరో మారు సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Image result for rashmika mandanna

ఈ చిత్రంలో గీతాగోవిందం తో మంచి పేరు తెచ్చుకున్న రష్మిక మందన నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  తాజాగా ఈ విషయంపై రష్మిక మందన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఈ ప్రాజెక్టు నుంచి తనని ఎవరూ సంప్రదించలేదనీ .. అందువలన తాను ఈ చిత్రం చేయడంలేదని, కాకపోతే త్వరలోనే విజయ్ తో కలిసి మరో చిత్రం చేసే అవకాశం వుందని అంటున్నారు. ఇదిలా ఉంటే..రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన కథానాయికల జాబితాలోను రష్మిక మందన పేరు ఉందనే ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: