తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం అన్నా, మెగా కుటుంబం అన్నా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఈ కుటుంబం నుంచి ప్రస్తుతం స్టార్ హీరోలు తమ సత్తాచాటుతున్నారు.  మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  ఇక నందమూరి కుటుంబ నుంచి మహానటులు ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు.  ఆయన సోదరులు దివంగత నందమూరి హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  అయితే జూ.ఎన్టీఆర్ వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. 

Related image

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌, నంద‌మూరి హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. ఈ మ‌ధ్య కాలంలో వారి ఫ్రెండ్షిప్ మ‌రింత బ‌ల‌ప‌డింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌రణ్‌లు క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ కూతురు  నారా బ్రాహ్మ‌ణి, చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇండస్ట్రీ పరంగా కాకుండా వీరు వ్యాపార పరంగా కూడా అప్పుడప్పుడు కలుసుకుంటారు. 

Image result for upasana nara brahmani

ఈ మద్య వీరిద్దరూ ఈజిప్ట్‌లో సంద‌డి చేశారు. ఈజిప్టులో ఫేమస్ పిరమిడ్‌గా పేరొందిన గిజా పిరమిడ్ వద్ద తమ స్నేహితులతో కలిసి ఉపాసన, బ్రాహ్మణి ఫోటోలు దిగారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఉపాసన తాజాగా వీరిద్దరు తీసుకున్న ఫోటో సోషల్ మీడియాల్ పోస్ట్ చేశారు. గురు, శుక్ర, శనివారం ఈజిప్టులో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం, చర్చించుకున్నాం అని పేర్కొంటూ కామెంట్ పెట్టింది ఉపాస‌న‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: