బాలీవుడ్ లో బాలనటిగా పరిచయం అయిన శ్వేతాబసు ప్రసాద్ తెలుగులో కొత్తబంగారులోకం,కాస్కో, రైడ్ కళావర్కింగ్ సినిమాల్లో నటించింది. నటిగా మంచి కెరీర్ కొనసాగిస్తున్న శ్వేతాబసు వ్యభిచార కేసులో పట్టుబడటం అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని..కావాలనే తనను ఇరికించారని శ్వేతాబసు ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ కేసు గోళ పూర్తయ్యింది..తాజాగా శ్వేతాబసు ప్రసాద్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఈ మద్య బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా ఉన్నవారందరు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలెక్కుతున్నారు.
ఇటీవల రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణేల వివాహం ఇటలీలో లేక్ కోమ్ వేదికగా రెండు రోజుల పాటు ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 2,3 తేదీలలో ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్ జోనాస్ని హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోనుంది. శ్వేతా బసు చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్న లవ్ బర్డ్స్ రెండేళ్ళ నుండి కలిసి జీవిస్తున్నారు.
డిసెంబర్ 13న పుణెలో వీరి పెళ్లి వేడక జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయం ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారు. 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన శ్వేతా నేషనల్ అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు ఇండోనేషియాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా దిగిన ఫొటోలను శ్వేతాబసు ప్రసాద్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.