బుల్లితెర పై ఎన్ని కొత్త టెలివిజన్ షోలు ప్రవేశపెడుతున్నా సంవత్సరాల తరబడి బుల్లితెర రేటింగ్స్ లో అగ్రగామిగా కొనసాగుతున్న ‘జబర్దస్త్’ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయలేకపోయారు. ఈ షో పై ఎన్ని విమర్శలు వచ్చినా మరిన్ని వివాదాలు చుట్టుముట్టినా ఈషోను చూసేవారి సంఖ్యలో ఏమాత్రం మార్పు లేకపోవడం ఈ షో మ్యానియాను సూచిస్తోంది. 

ఈకార్యక్రమంలో స్కిట్స్ ప్రజెంట్ చేసిన నటులు భాగ్యనగరంలో విల్లాలు కొనుక్కుంటే ఈకార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ కు కోట్లు కురుస్తున్నాయి. ఇలాంటి ఈకార్యక్రమానికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

దీనికికారణం ఈకార్యక్రమం ద్వారా వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హైపర్ ఆది అని అంటున్నారు. గత కొన్నివారాలుగా హైపర్ ఆది నటించిన స్కిట్స్ జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడం లేదు. దీనితో ఆశ్చర్యానికి లోనైన బుల్లితెర ఇండస్ట్రీ వర్గాలు ఈవిషయమై సమాచారం సేకరిస్తే ఈ షోలో కొందరితో ఏర్పడ్డ భేదాభిప్రాయాలు వల్ల హైపర్ ఆది ఈ షో నుంచి తప్పుకున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా హైపర్ ఆది కోసమే ఈకార్యక్రమం చూసే బుల్లితెర ప్రేక్షకులు లక్షలలో ఉన్నారు. ఇప్పుడు ఈవార్తలే నిజం అయితే ‘జబర్దస్త్’ కార్యక్రమానికి వస్తున్న రేటింగ్స్ మరింత తగ్గిపోయే ఆస్కారం ఉంది. దీనితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మల్లెమాల సంస్థ యాజమాన్యం హైపర్ ఆదితో మంతనాలు జరుపుతూ ‘జబర్దస్త్’ కార్యక్రమానికి రేటింగ్స్ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: