తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’పెద్ద సంచలన విజయం సాధించింది.  ఈ చిత్రం అప్పట్లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. అందుకు తగ్గట్టుగా జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తూ భారీ కలెక్షన్లు సాధించింది.  ఈ చిత్రానికి సీక్వల్ గా అదే కాంబినేషన్ లో ‘2.ఒ’ తెరకెక్కింది.  నేడు  చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 
Image result for 2.0 movie
ఇక ప్రీమియం షో చూసిన వారు ఈ చిత్రం రజినీకాంత్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా చెబుతున్నారు.  '2.ఓ' బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేసిందని తొలి రివ్యూలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని శంకర్ అద్భుతంగా చిత్రించారని, చివరి 30 నిమిషాల పాటు రెప్పార్పకుండా చూసేంత అద్భుత గ్రాఫిక్స్ ఉన్నాయని ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రయిలర్ చూసింది చాలా తక్కువేనని, చిత్రంలో చూడాల్సింది ఎంతో ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Image result for 2.0 movie
'2.ఓ'కు పక్షిరాజాకు మధ్య జరిగే యుద్ధం సినీ ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండి పోతుందని అంటున్నారు.  'రోబో'కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రంలో పాత సినిమా జ్ఞాపకాలను, అందులోని పాత్రలైన డాక్టర్ బోరా, సన పాత్రలను స్పృశించారని, దీంతో కథ అత్యంత ఆసక్తికరంగా ఉందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం 'బాహుబలి' రికార్డులను తిరగరాస్తుందని అభిమానులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: