బడ్జెట్ ఉంటే హాలీవుడ్ స్థాయిని మించి సినిమాను తీయవచ్చు అని దర్శకుడు శంకర్ చెప్పిన మాటలు అక్షరాల నిజం అయ్యాయి. భారతీయ వెండి తెరకు భారీ తనం అంటే ఎలా ఉంటుందో శంకర్ తన ‘2.ఓ’ ద్వారా చూపిస్తూ చేసిన ప్రయోగానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోని భారతీయ సినిమా అభిమానులు ‘2.ఓ’ కు అఖండవిజయం కలిగించే టోటల్ పాజిటివ్ టాక్ ను ఇవ్వడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మన తెలుగు రాష్ట్రాలలో ‘2.ఓ’ కలక్షన్స్ రికార్డుల గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఐ షూటింగ్ జరుగుతున్న సమయంలో
ఇలా ఉంటే ఈరోజు ఉదయం నుండి తమిళ సోషల్ మీడియాలో ప్రభాస్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి సంబంధించిన వార్తలు తెలుసుకుని ప్రభాస్ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ‘మీ బాహుబలి రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి జాగ్రత్త’ అంటూ కొందరు రజినీకాంత్ వీరాభిమానులు ప్రభాస్ ను అదేవిధంగా ‘బాహుబలి’ ని టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ ప్రభాస్ అభిమానులకు అసహనం కలిగించినా తమిళనాడులోని ప్రభాస్ ఫ్యాన్స్  ‘2.ఓ’ చిత్రాన్ని విష్ చేస్తూ తమ హుందాతనాన్ని చాటుకుంటున్నారు. 
600 కోట్ల బడ్జెట్‌కు తగ్గట్లుగా
ఇది చాలదు అన్నట్లుగా ఈరోజు తమిళనాడులోని ‘2.ఓ’ ధియేటర్లలో రజినీకాంత్ అభిమానులు చేసిన హడావిడి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. సామాన్యంగా థియేటర్లోనే కొంత సేపు డప్పుల మోత మధ్య డాన్స్ చేయడం రజినీకాంత్ ను చూడగానే పేపర్లు ఎగరవస్తూ హంగామా చేయడం మామూలే అయినా ఏకంగా చాల ధియేటర్లలో కొద్దిసేపు ఈసినిమా ప్రదర్శనను ఆపుచేసి ఏకంగా ధియేటర్ లోని సీట్లు ఎక్కి డాన్సులు చేయడంతో ఈమూవీ మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. 
 అందరూ మౌనంగా...
అంతేకాదు నిన్న బుధవారం రాత్రి నుంచే చాలామంది ఆడవాళ్ళు తమ చిన్న పిల్లలను తీసుకుని మరీ ఈమూవీ టిక్కెట్ల కోసం చలిలో క్యూలో నుంచున్నారు అంటే రజినీకాంత్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు సంచలనాలు ఎలా ఉంటాయో మరొకసారి అందరికీ అర్ధం అయ్యేలా చేసింది. ముఖ్యంగా తమిళలు ఎక్కువగా ఉండే మలేషియాలో సైతం 2.0 ఫీవర్ ఎక్కువగా కనిపిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో ‘బాహుబలి’ రికార్డులను ఇది క్రాస్ చేస్తుంది అంటూ అప్పుడే మీడియాలో అంచనాలు మొదలైపోయాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: