టాలీవుడ్ లో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వలో ప్రభాస్, రానా ముఖ్య పాత్రలో ఈ సినిమా జాతీయస్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.  దాంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇక వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పది సంవత్సరాల టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  ఈ సినిమా రైతు సమస్యలపై ఒక సామాన్యుడు చేసిన పోరాటాన్ని ఎంతో గొప్పగా చూపించారు. ఇక మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మసాల కూడా ఉండటంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.  


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ హిరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయని ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 

Image result for sahoo prabhas

స్వాతంత్ర  సమరయోధుడి నేపథ్యంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక  ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో’ సినిమా కూడా ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు అవుతున్నాయట. రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో, ఇప్పుడు ఈ విషయాన్ని గురించిన చర్చలే ఫిల్మ్ నగర్లో నడుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: