సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా  వేచి చూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ , అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ‘2.0’ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది వేల‌కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌లైంది. శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్‌కి మంచి రివ్యూస్ వ‌స్తున్నాయి. ఈ సినిమా బాహుబ‌లి 2 రికార్డ్స్‌ని బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం అని అంటున్నారు. కానీ ఇప్పుడు ‘2.0’షాక్ తగిలింది..సినిమా విడుదలయి కొద్ది గంటలు కూడా గడవక ముందే పైరసీ అందుబాటులోకి రావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
2.O మూవీ వసూళ్లపై దెబ్బ
దక్షిణాది సినీ పరిశ్రమకు తమిళ్‌రాకర్స్ ఓ పెద్ద ప్రమాదంలా దాపురించింది. మూవీ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే హై క్వాలిటీ హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసింది. లైకా ప్రొడక్షన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ రాకర్స్ ఎత్తుగడలను ఎదుర్కోలేకపోయింది. ‘2.0’ మూవీ పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో రావడంతో సినిమా యూనిట్ ఆందోళనలో పడింది. ఈ సినిమా దేశ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ రూ.600 కోట్లతో రూపొందించిన సంగతి తెలిసిందే.
తమిళ్ రాకర్స్‌పై పోరాటం
ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘2.0’ చిత్రం పైరసీ గురికాకుండా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా పోస్ట్ చేసే డౌన్ లోడింగ్ లింకులపై ఉక్కుపాదం మోపేందుకు అనుమతి తీసుకొన్నారు.  ఓపెనింగ్స్‌పరంగా కలెక్షన్లు రాబట్టుకోగలిగినప్పటికీ పైరసీ భూతాన్ని ఎదుర్కొని ‘2.0’ ఎంతవరకూ నిలబడగలదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 2.0 tamilrockers
ఈ సినిమా పైరసీ ఆపాలని పది మందితో బలమైన టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నామో మేము బయ టికి వెల్లడించలేమని చెప్పింది. కానీ తమిళ్‌రాకర్స్ హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ అక్రమంగా పోస్ట్ చేయడంతో ఖంగు తిన్నారు చిత్రయూనిట్ . పైరసీ దాడులను అడ్డుకొంటామని లైకా ప్రొడక్షన్ చెప్పినప్పటికీ బలంగా ప్రభావం చూపలేకపోయింది.  అయితే సీనీ ఫ్యాన్స్ కి ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయవొద్దని  ‘2.0’చిత్ర యూనిట్ కోరుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: