బాలీవుడ్ లో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే అనుష్క శర్మ, దీపిక పదుకొన్ వంటి తారలు వివాహం చేసుకున్నారు. త్వరలోనే ప్రియాంక చోప్రా కూడా పెళ్లి చేసుకోబోతుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన శ్వేతాబసు ప్రసాద్ కూడా తన ప్రియుడిన డిసెంబర్ 13న పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ లో హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..వివాదాల్లో ఉండటం ఆమెకు అలవాటే.
ఆ మధ్య మీటూ ఉద్యమాన్ని ఇండియాలోకి తీసుకొచ్చిన తను శ్రీ దత్తా మీద సంచలన కామెంట్స్ చేసి హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత హరియాణాలోని పంచకులలో జరిగిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(సీడబ్ల్యూఈ) పోటీ సందర్భంగా జరిగిన ఘటనతో మరో సారి వార్తలలోకి వచ్చింది. తాజాగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఇండియా గాట్ టాలెంట్’ యాక్టర్ దీపక్ కలాల్ని డిసెంబర్ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు లాస్ ఏంజెల్స్లో వివాహం చేసుకోబోతున్నట్టు రాఖీ సావంత్ తెలిపింది.
అప్పట్లో నేను పెళ్లి చేసుకుంటా ఎవరైనా ఉన్నారా? అంటూ స్వయంవరం పేరుతో ఓ ప్రోగ్రామ్ కూడా చేసింది రాఖీ సావంత్. తరువాత స్వయంవరంలో గెలిచిన వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి పెళ్లి లేదు గిల్లీ లేదని ముఖం చాటేసింది. ఇక దీపక్ కలాల్ విషయానికి వస్తే..సోషల్ మీడియాలో ఆడవాళ్ల లో దుస్తులు ధరించి ఆడ గొంతుతో పిచ్చి పిచ్చి వీడియోలను పోస్ట్ చేస్తూ.. ట్రోలింగ్ అవుతూ ఫేమస్ అయ్యారు.
అప్పట్లో కాశ్మీర్ అంశంపై నోరుపారేసుకుని చేతులు కాల్చుకున్నాడు. కాగా, తన వెడ్డింగ్ కార్డ్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రాఖీ సావంత్ .. మేం ఒక్కటవ్వాలనుకుంటున్నాం. . ఇండస్ట్రీలో చాలా మంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్ టైమ్ అనిపించింది... అందరి ఆశీర్వాదం మాకు కావాలి అని రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాకు తెలిపారు. మరి ఈ ఇద్దరు వివాదాస్పద వ్యక్తులు పెళ్లి చేసుకుంటారనే విషయం నిజమా..కాదా అన్నది బాలీవుడ్ లో చర్చనీయంశంగా మారింది.