రజినికాంత్, శంకర్ ల కలయికలో ప్రతిష్టాత్మక సినిమాగా వచ్చిన సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వచ్చిన ఈ మూవీలో ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. సినిమా సాంకేతికంగా ఎంతో గొప్పగా ఉందన్న టాక్ వచ్చింది. అయితే కథ, కథనాల్లో ఇదవరకు శంకర్ సినిమాల మార్క్ చూపించలేదని అంటున్నారు.


రోబో సినిమాలో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో వశీకర్ తో పాటుగా చిట్టి రోబోని ప్రేమలో దించేసింది ఐశ్వర్య. అయితే 2.ఓలో వెన్నెలగా నటించింది ఎమీ జాక్సన్. ఇక్కడ విశేషం ఏంటంటే ఎమీ జాక్సన్ కేవలం ఒక రోబోగా చూపించడం జరిగింది. ఎమీ జాక్సన్ సినిమాలో ఉంది అంటే కచ్చితంగా ఆమె అందాల ప్రదర్శన ఉంటుందని అనుకుంటారు అభిమానులు.


అయితే అలాంటి వారికి నిరాశ మిగిలింది. ఇదో ప్రయోగాత్మక సినిమా అందులో రొమాన్స్ కు తావుండదు. కాని ఎమీ లాంటి హాట్ బ్యూటీని పెట్టుకుని ఎలాంటి రొమాన్స్ చూపించకపోవడం ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. చివర్లో పాటలో కాస్త ఎమీ మెరుపులు మెరిసింది. కంటెంట్ కు కనెక్ట్ అయిన ఆడియెన్స్ కు ఇవేమి ఆలోచనలు రావు. కాని అది ఎక్కని వారికి ఇవన్ని ఆలోచనకు వస్తాయి. 


ఫైనల్ గా విజువల్ గ్రాండియర్ గా 2.ఓ అద్భుతంగా ఉంది. రజిని, శంకర్ ల సినిమా అంచనాలకు తగినట్టుగానే సినిమా వచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉన్నాయి. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని రజినికాంత్ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: