బాక్సాఫీస్ యుధ్ధంలో  గెలిచిన రజనీకాంత్ శంకర్ ల బ్లాక్ బస్టర్ మూవీ 2వో అక్కడ మాత్రం ఓడిపోయింది. ప్రపంచాన్ని జయించి జేజేలు కొట్టించుకున్న ఈ చిత్ర రాజాం సొంత గడ్డలోనే పరాజయం పాలైంది. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. సాంకేతికత అతి అయితే వచ్చే అనర్ధాలు వివరించే ఈ చిత్రాన్ని అదే సాంకేతికత దెబ్బ తీయడం దారుణమే.


కోట్లాది రూపాయలతో తెరకెక్కించిన 2.ఓ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా పైరసీ అవ్వడంతో షాకయ్యారట. అసలు 2.ఓ విడుదలకు ముందే తమిళ రాకర్స్ పైరసీ వెబ్ సైట్ 2.ఓ విడుదలైన మరుక్షణమే ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ఛాలెంజ్ చేసింది.
మరి చెప్పినట్టుగానే సినిమా మొత్తం ఆన్లైన్లో పెట్టేసింది. మరి భారీ ఓపెనింగ్స్ తెచ్చిన 2.ఓ సినిమా ఇలా పైరసీ అవ్వడంతో.. కలెక్షన్స్ లో కోత పడే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే బాహుబలితో పోటీ అంటున్న రజిని అభిమానులు ఈ పైరసీ విషయం తెలిసినప్పటినుండి కాస్త కంగారులో ఉన్నారు. మరి ఎలా దీన్ని తట్టుకోవడమో అర్ధం కాక సతమవుతున్నారు నిర్మాతలు.


అసలే 550 కోట్ల రూపయన బడ్జెట్ మూవీ ఇది.  కళ్ళ నిండుగా గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ ఇలా సినిమా చూస్తున్నంత సేపు మరో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉన్న 2.ఓ సినిమా ఇలా ఆన్ లైన్లో రావడంతో రజిని అభిమానులు షాకవుతున్నారు. 3డి లో 2.ఓ వీక్షించిన ప్రతిఒక్కరు 2.ఓ 3 డి ఎఫెక్ట్స్ అదుర్స్ అంటూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తుంటే.. ఇప్పుడు 2.ఓ సినిమా ఆన్ లైన్ లోనే దొరుకుతుందనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. దీంతో ఈ మూవీకి భారీ ఎత్తున వస్తాయనుకున్న కలెక్షన్లు దారుణంగ పడిపోతాయన్న బెంగ అందరిలో పట్టుకుంది. మరి దీన్ని చిత్ర నిర్మాతలు, డైరెక్టర్ శంకర్ ఎలా ఎదుర్కొంతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: