శంకర్, రజిని కాంబోలో వచ్చిన 2.ఓ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్కడక్కడ మిక్సెడ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. మల్టీప్లెక్స్ ఆడియెన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తుండగా బి,సి సెంటర్స్ ఆడియెన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ఓవరాల్ గా సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.


ఇక ఈ సినిమా చూశాక సెట్స్ మీద ఉన్న భారీ బడ్జెట్ మూవీ సాహో, సైరా సినిమా దర్శక నిర్మాతలు ఎలర్ట్ అయినట్టు తెలుస్తుంది. సినిమా ఎంత గ్రాండియర్ గా ఉన్నా కథను ఆడియెన్స్ కు ఎంగేజ్ చేయిస్తేనే ఫలితం పాజిటివ్ గా ఉంటుంది లేదంటే తేడా కొట్టేస్తుందని చెబుతున్నారు. 2.ఓ కథ బాగుంది. అయితే దాన్ని ఆడియెన్స్ కు ఎంగేజ్ చేయడం లో కొద్దిగా గురి తప్పాడు శంకర్.


ఎలాగోలా విజువల్స్ తో వండర్స్ క్రియేట్ చేయడం వల్ల సినిమా నీలబడ్డది. అయితే 600 కోట్ల బడ్జెట్ కు సరిపడే టాక్ అయితే రాలేదని చెప్పాలి. 2.ఓ ఫీవర్ ఆడియెన్స్ లో అంతగా కనిపించలేదు. కోలీవుడ్ లో 2.ఓ సంచలనాలు సృష్టిస్తుంది. అక్కడ విజయ్ సర్కార్ సినిమా రికార్డులను కొల్లగొట్టింది.


సైరా 200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న సినిమా.. సాహో కూడా దాదాపు అంతే బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 2.ఓ సినిమా ఎక్కడ ఆడియెన్స్ ను రీచ్ కాలేకపోయిందో ఆ పాయింట్స్ లో వాళ్లు జాగ్రత్త పడుతున్నారు. కేవలం గ్రాఫిక్స్ ఒక్కటే సినిమాను ఆడించలేవన్న విషయం వారు గుర్తుంచుకుంటే మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: