సాధారణంగా సినీ హీరో, హీరోయిన్లు అంటే ఎంతో మంది అభిమానలు ఉంటారు. అందులో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ అభిమానుల ఉండటం చూస్తునే ఉన్నాం. తమను ఎమన్నా పరవాలేదు..తమ హీరోని మాత్రం పన్నెత్తు మాట అంటే సహించరు..ఈ ఫ్యాన్స్. ఇక తమిళ నాట సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులు ఉన్నారు. కేవలం తమిళనాటనే కాదు యావత్ భారత దేశంలో రజినీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇక రజినీకాంత్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే..ఫ్యాన్స్ వారం రోజుల ముందు నుంచే పండుగ చేసుకుంటారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి ఒకరంగా ఉత్సవాలే చేస్తుంటారు.
తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘2.ఒ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావడం పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. దాంతో రజినీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తాజాగా ఓ అభిమాని తన ఆటోని పూర్తిగా 2.0 స్టైల్లో తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
చిత్రంలో మాదిరి సెల్ఫోన్లను తన ఆటోకు అతికించేసి.. ఆటో పైన చుట్టూ తుపాకులతో రజనీ బొమ్మను అరెంజ్ చేశాడు. ఆ ఫోటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం 2.0 సక్సెస్ మానియాలో తడిసి ముద్దవుతున్న ఫ్యాన్స్కి వచ్చే ఏడాది జనవరిలో మరో మంచి వినోదం పేటా చిత్రం ద్వారా అందనుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పేటా చిత్రంలో రజనీకాంత్, త్రిష, సిమ్రాన్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.