ఇండస్ట్రీ ట్రెండ్ సెటర్ గా ఒక వెలుగు వెలిగిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన ఇమేజ్ పూర్తిగా కోల్పోవడంతో తన దగ్గర పనిచేసిన దైరెక్టర్స్ టీమ్ పై ఆధారపడి తన భవిష్యత్ మెరుగుపరుచుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. వర్మ నిర్మాతగా మారి నిర్మించిన ‘భైరవగీత’ సినిమాను తఃన శిష్యుడు సిద్దార్థ వర్మ చేత డైరెక్ట్ చేయించిన విషయం తెలిసిందే. 

వాస్తవానికి ఈవారం ఈమూవీ విడుదల కావలసి ఉన్నా ‘2.0’ మ్యానియాకు భయపడి ఆసినిమా విడుదలను వాయిదా వేసాడు. తాను నిర్మాతగా నిర్మించిన ఈమూవీ ఫలితం ఇంకా తెలియకుండానే వర్మ ‘ఆర్ ఎక్స్ 100’ తో సంచలనాలు సృష్టించిన అజయ్ భూపతి తాను కలిసి నిర్మించబోతున్న మరొక సినిమాను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 

ఒక పక్క యువ హీరో రామ్ తో సినిమా చేస్తూనే అజయ్ భూపతితో వర్మ ఈసినిమాను నిర్మిస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య కాలంలో వర్మ తన శిష్యులను ఫిలిం ఫంక్షన్స్ లో ఆకాశానికి ఎత్తేస్తూ పొగడటం ఒక పనిగా పెట్టుకున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా వర్మ తన శిష్యులను తనతో పాటు నిర్మాతలుగా కూడ మార్చి ప్రయోగాలు చేస్తున్నాడు. 

‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తీసే సమయంలో కనీసం సొంత కారు కూడ లేని అజయ్ భూపతి ఇప్పుడు ఇండస్ట్రీ సెలెబ్రెటీ. ఇలా తన శిష్యులను చాలా వ్యూహాత్మకంగా వాడుకుంటూ దర్శకుడుగా కళతప్పిన వర్మ నిర్మాతగా సక్సస్ సాధించాలని చేస్తున్న ప్రయోగాలలో అజయ్ భూపతి పరిస్థితి ఏమిటి అన్నది రానున్న రోజులలో తేలుతుంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: