టాలీవుడ్ ప్రిన్స్ మహేష్బాబుకు అందగాడని పేరు. ఆయన అందాన్ని లేడీసే కాదు, మగవాళ్ళు కూడా మెచ్చుకుంటారు. ఇక అయన సినిమాలూ అందంగానే ఉంటాయి. ఇపుడు ఆయన ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట నిర్మిస్తున్న మల్టీప్లెక్స్ను కూడా చాలా అందంగా ఉందిట. ఇపుడు దీనిని తుది మెరుగులు పూర్తికావడంతో ఓపెనింగ్కు రెడీ అయ్యింది మేనేజ్మెంట్. రేపు (డిసెంబర్ 2)న దీనిని ప్రారంభిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ మల్టీప్లెక్స్ చూసిన దర్శకుడు రాం గోపాల్ వర్మ బ్యూటీఫుల్ అని ఒక్క మాటతో చెప్పేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా చేసుకుని మహేష్ నూతన నిర్మానంపై ప్రశన్సలు కురిపించారు. మహేష్ అంత అందగా ఉందనేశారు. దీంతో ఈ మల్టీప్లెక్స్ పై ఆసక్తి పెరిగిపోతోంది. ఇదిలా ఉండగా తొలుత ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తో మల్టీప్లెక్స్ని ప్రారంభించాలని ప్లాన్ చేసినప్పటికీ అప్పటికి నిర్మాణం పూర్తికాలేదు. రజినీకాంత్ సినిమా 2.0తో నవంబర్ 29న స్ర్కీనింగ్ మొదలుపెట్టాలని ఆలోచన చేసింది మేనేజ్మెంట్. అదీ కూడా కార్యరూపం దాల్చలేదు.
చివరకు డిసెంబర్ రెండు సాయంత్రం ఆరుగంటలకు 2.0 సినిమాతో గ్రాండ్గా ఓపెన్ కానుంది ఏఎంబీ మల్టీప్లెక్స్. గచ్చిబౌలిలో అధునాతన సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీతో ఏడు స్క్రీన్స్ అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి మహేష్ నూతన వెంచర్ మీద అపుడే ప్రశన్సల జల్లు కురుస్తోంది. మరి రేపటి రోజున అక్కడ సినిమా చూసి ఆస్వాదించాలనుకునే వారు మేంత హ్యాపీ ఫీల్ అవుతారో, మెరెంతగా పొగుడుతారో.