టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటుంది. కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న రష్మిక తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం కూడా రష్మికకు మంచి హిట్ ఇచ్చింది.


రష్మిక ఎంచుకున్న సినిమాలు కూడా క్రేజీగా ఉండటంతో సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి కూడా బాగా ఉంది. నాగార్జున, నానిల దేవదాస్ సినిమా కూడా రష్మికకు మంచి ఫలితాన్నే అందించింది. ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో మరోసారి రొమాన్స్ చేస్తున్న రష్మిక ఆ సినిమాతో కూడా హిట్టు కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది.


ఇక ఇప్పుడు రష్మిక మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. దిల్ రాజు బ్యానర్ లో మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన జిగుర్తండా సినిమా రీమేక్ లో వరుణ్ తేజ్, నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. 


ఈ రీమేక్ లో హీరోయిన్ గా రష్మిక ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. తెలుగులో వరుసగా క్రేజీ ఆఫర్స్ సొంతం చేసుకుంటున్న రష్మిక చూస్తుంటే ఇక్కడ స్టార్ హీరోయిన్ గా టాప్ చెయిర్ దక్కించుకునేలా ఉంది. ప్రస్తుతం తెలుగులోనే సినిమా చేస్తున్న అమ్మడు కోలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: