ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ‘మీ టూ ’ ఉద్యమం ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. హీలీవుడ్ లో మొదలైన ఈ ప్రకంపణలు బాలీవడ్ కి పాకింది..ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపిస్తుంది. బాలీవుడ్ లో తనూశ్రీ దత్త గత పది సంవత్సరాల క్రితం తనపై నటుడు నానా పటేకర్, కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత మరికొంత మంది నటీమణులు, ఇండస్ట్రీకి చెందిన వారు తప పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో బహిరంగంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు.
దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి తనపై రచయిత వైర ముత్తు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఇలా చిత్రపరిశ్రమపై ‘మీ టూ ’ఎఫెక్ట్ బాగా పడటంతో నటీ, నటులు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ మద్య బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ‘కవచం’టీజర్ వేడుకలో కాజల్ ని ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తనను తాను కవర్ చేసుకున్నా చోటా..కాజల్ సైతం పెద్దగా పట్టించుకోకుండా చోటాను కవర్ చేసింది. కానీ, మీడియాలో మాత్రం ఆ క్షణం నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ అవుతూ రచ్చ రచ్చ చేశారు.
కాకపోతే సినిమా వాళ్ళకు అవన్నీ షరా మామూలే అనుకోండీ. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్ లో వస్తున్న ‘కవచం’ సినిమా ఆడియోలో కూడా చోటా.. కాజల్ గురించి మాట్లాడాడు. ‘కవచం ’ సినిమా కోసం కాజల్ ఎంతో కష్టపడి వర్క్ చేసిందని..ఇసుక తుఫానును కూడా లెక్కచెయ్యకుండా చాలా కష్టపడి ఈ సినిమాను చేసింది అని, సినిమా పట్ల అంత డెడికేషన్ చూపించడం వల్లనే ఆమె ఆ స్థాయిలో ఉంది అని, షరా మామూలుగా పొగడ్తల్లో ముంచెత్తేశాడు.
అయితే తాను స్పీచ్ ఇస్తున్నంత వరకు గతంలో జరిగిన ముద్దు సీన్ గురించి అస్సలు ప్రస్తావన తీసుకు రాలేదు..అంతే కాదు చివర్లో కాజల్ ను ‘ లవ్ యు డార్లింగ్…లవ్ యూ నాన్న’అంటూ సరిపెట్టాడు. మొత్తంగా ముద్దు తెచ్చిన తిప్పలతో కాస్త జాగ్రత్త పడ్డాడు చోటా అని చెప్పుకోవచ్చు.