రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీ ఇపుడు సెట్స్ పైన ఉంది. ఈ మూవీలో ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి. అవి రోజుకొకటి చొప్పున ఫిల్మ్ మేకర్స్ ద్వారా లీక్ అవుతోంది. లేటేస్ట్ గా ఆలాంటిదే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇద్దరు టాప్ హీరోలు ఉన్న ఈ మూవీలో పవర్ ఫుల్ లేడీ విలన్ ఉంటారని టాక్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో ఆమెదే కీ రోల్ అని కూడా అంటున్నారు. ఆ రోల్ ప్లే చేయడానికి ఓ మాజీ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారని అంటున్నారు.


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమ దొంగ మూవీలో జూనియర్ కి జోడీగా నటించిన ప్రియమణిని లేడీ విలన్ గా ట్రిపుల్ ఆర్ లో తీసుకుంటున్నారని తెలుస్తోంది. యమదొంగ  తర్వాత కొంత మంది స్టార్ హీరోలతో ప్రియమణి నటించింది. వివాహం తర్వాత ప్రియమణి నటనకు దూరం కావడంతో మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కానీ, ట్రిపుల్ ఆర్ చిత్రం ద్వారా ప్రియమణి మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుందని అంటున్నారు. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ లేడీ విలన్‌గా ప్రియమణి కనిపించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


ఇదిలా ఉండగా మల్టీస్టారర్ మూవీ 'ట్రిపుల్ ఆర్ లూ ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభంకాగా, హీరోయిన్లతో ఇతర నటీనటుల ఎంపిక మాత్రం ఇంకా జరగలేదు. మరి కొద్ది రోజుల్లో హీరోయిన్ల సెలక్షన్ కూడా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: