వరస పరాజయాలలో ఉన్న నాని తన పద్ధతి మార్చుకుని తాను నటించబోయే సినిమాల కథల ఎంపికలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాలో నటిస్తున్న నాని తన తదుపరి సినిమాగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన కథకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్న నాని పాత్రతో సమానంగా ఐదుగురు మహిళల పాత్రలు ఉంటాయని టాక్. నాని ఈవిషయం గురించి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ‘నేను ఇంకా మిగితా ఆ ఐదుగురు’ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఆ ఐదు స్త్రీ పాత్రలు ఎవరు అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.  

ఈ ఐదు స్త్రీ పాత్రలలో ఒక పాత్ర మిడిల్ ఏజ్ ఆంటీ అయితే ఒక టీనేజ్ గర్ల్ ఒక పెద్దావిడ ఒక వయసుకొచ్చిన కూతురు ఓ వయసు మళ్ళిన తల్లి ఇలా మొత్తం ఐదు పాత్రల చుట్టూ నాని విక్రమ్ కుమార్ ల మూవీ కథ తిరుగుతుందని సమాచారం. దీనితో విక్రమ్ కుమార్ నానీతో తీయబోతున్న మూవీ కథ గతంలో విడుదలై పెద్దగా విజయం సాధించని గొలుసు కథల సినిమాలు ‘చందమామ కథలు’ ‘మనమంతా’ మూవీలను పోలి ఉంటుందా అన్న కోణంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

దీనికితోడు ఈమూవీ కథను ఒకటికి పది సార్లు విని అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడంతో చివరకు ఈకథ అనేక మలుపులు తీసుకుని నాని కాంపౌండ్ కు చేరుకుంది. దీనితో విక్రమ్ కుమార్ బన్నీతో చేయాలనుకున్న ప్రయోగాలకు నాని కేంద్ర బిందువుగా మారాడా అంటూ మరికొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: