బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు 12వ సీజన్ రన్ అవుతుంది. మొదటి నుంచి బాలీవుడ్ లో బిగ్ బాస్ ఎదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. తాజాగా హిందీ ‘బిగ్బాస్’ సీజన్-12లో పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్కు ఆసుపత్రిపాలయ్యారు. బిగ్బాస్ హౌస్లో జరిగిన చిన్న గొడవ కారణంగా శ్రీశాంత్ తనని తాను గాయపరుచుకున్నట్లు తెలిసింది. తోటి హౌస్ మేట్ సురభి రానాతో గొడవ పడ్డ క్రికెటర్ శ్రీశాంత్, తన తలను బాత్ రూమ్ గోడకేసి కొట్టుకోవడంతో గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యమూ ఏదో రకంగా వార్తల్లో ఉంటున్న శ్రీశాంత్ కు అభిమానులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ సీజన్ లో టైటిల్ గెలిచే చాన్స్ ఉన్నవారిలో శ్రీశాంత్ ఉన్నాడని అంటున్నారు. కాగా, ఈ గొడవకు ముందు శ్రీశాంత్, సురభిల మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఇద్దరూ హద్దులు దాటారు. సురభి దురుసుగా మాట్లాడుతూ..శ్రీశాంత్ ని మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని దుమ్మెత్తి పోసింది. దాంతో రెచ్చిపోయిన శ్రీశాంత్ సైతం ఆమెను చాలా దారుణంగా తిట్టాడు..సురభి నువు ఓ వ్యభిచారి అంటూ సంబోధించాడు.
తోటి కంటిస్టెంట్లు వీరిని ఎంతగా వారించినా ఇద్దరూ తిట్లపురాణాన్ని కొనసాగించారు. ఈ గొడవ సర్ధుమణిగిన తర్వాత తొందరపడి తానన్న మాటలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సురభికి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత, తానన్న మాటలకు కుంగిపోయిన శ్రీశాంత్ బాత్రూములోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఇక శ్రీశాంత్ ఆరోగ్యంపై భువనేశ్వర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. శ్రీశాంత్ను హాస్పిటల్కు తరలించారని తెలియగానే చాలా ఆందోళనకు గురయ్యా. శ్రీశాంత్ కు ఎక్స్రే, తదితర వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన బిగ్బాస్ హౌస్కు తిరిగి వెళ్లారు. ఎలాంటి ఆందోళన వద్దు. మీ అభిమానానికి, ప్రేమా అప్యాయతలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.