బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు అన్న అంచనాలను మించేలా ట్రిపుల్ ఆర్ తో ఎనౌన్స్ చేసి ఆశ్చర్యపరచాడు రాజమౌళి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సినిమా మొదలవగా ఈ సినిమా మరోసారి బాహుబలి రికార్డులు బ్రేక్ చేసేలా ఉంటుందని అంటున్నారు.


అయితే కోలీవుడ్ లో కూడా ఇలాంటి మల్టీస్టారర్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. క్రేజీ డైరక్టర్ మణిరత్నం ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మల్టీస్టారర్ లో విజయ్, విక్రం, శింబులతో తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాను మణిరత్నం భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడట. 


విజయ్, విక్రం లాంటి స్టార్స్ నటిస్తే ఇక ఆ ప్రాజెక్టుకి తిరుగు లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా కోలీవుడ్ లో క్రేజీ మూవీగా మారుతుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది. నవాబ్ సినిమాను కూడా మల్టీస్టారర్ గా తెరకెక్కించాడు మణిరత్నం. ఆ సినిమా సక్సెస్ అవడంతో మణిరత్నం ఈ మూవీ మీద దృష్టి పెట్టాడు.


ట్రిపుల్ ఆర్ కు పోటీ అని చెప్పలేం కాని మణిరత్నం చేస్తున్న ఈ మూవీ మరో దళపతి అయినా అవ్వొచ్చని అంటున్నారు తమిళ సిని వర్గాలు. ఎలాగు విజయ్, విక్రం లకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి మణిరత్నం చేసే ఈ మల్టీస్టారర్ మూవీపై కూడా మంచి అంచనాలున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: