తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య బాలీవుడ్ నటులు బాగా రాణిస్తున్నారు. ఆ మద్య అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం, కిక్ 2, సుప్రీమ్ చిత్రాల్లో నటించిన విలన్ రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమే. వాస్తవానికి రవికిషన్ మరాఠా చిత్రాల్లో హీరోగా నటించి తెలుగు లో విలన్ గా నటిస్తున్నాడు. మూవీస్ లో విలన్లు అమాయకులను మోసం చేస్తూ..బెదిరించి డబ్బు సంపాదించడం చూస్తుంటాం. కానీ రియల్ లైఫ్ లో వారే మోసపోయే సందర్భాలు కొన్ని ఎదురవుతుంటాయి.
ఇలాంటి పరిస్థితే ‘రేసుగుర్రం’ విలన్కి ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.కోటిన్నరకు రవికిషన్ను ముంచేశారట. ఓ ఫ్లాట్ విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి రవికిషన్ ఏకంగా రూ.కోటిన్న రూపాయలు అప్పజెప్పారట. కొంత కాలం తర్వాత అతనికి తెలిసిందట ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తనను దారుణంగా మోసం చేశారని. ముంబైలో ప్లాట్ కొనుగోలు నిమిత్తం కమల ల్యాండ్ మార్క్ గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు రవికిషన్ రూ. 1.5 కోట్లు అందించారు.
అయితే ఫ్లాట్ కి సంబంధించి అలాట్మెంట్ లెటర్ కూడా అందించారట. అయితే ఫ్లాట్ మాత్రం అతనికి అప్పజెప్పలేదు. తర్వాత ఆ ఫ్లాట్ గురించి వివరాలు తెలుసుకుంటే..అప్పటికే తనను మోసం చేసినట్లు తెలిసిందట. దాంతో రవికిషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికిషన్తో పాటు చాలా మంది ఆ సంస్థను నమ్మి మోసపోయిన వారిలో ఉన్నట్టు తెలుస్తోంది.