తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించిన రమ్య అందరికి సుపరిచితురాలే. కర్ణాటకలో మాజీ ఎంపి అయిన ఈ అమ్మడు అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే కన్నడ ప్రముఖ నటుడు అంబరీష్ మృతి పట్ల కేవలం ఒక్క మెసేజ్ తో మాత్రమే స్పందించిన రమ్య పట్ల కన్నడ ఫ్యాన్స్ కక్ష్య కట్టారు. అందుకే ఆమె రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 


హీరోయిన్ గా కన్నడ పరిశ్రమలోనే తెరంగేట్రం చేసిన రమ్య తెలుగు, తమిళ భాషల్లో ఫేమస్ అయ్యింది. అయితే సినిమా కెరియర్ కు త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టేసిన అమ్మడు కాంగ్రెస్ తరపున ఓసారి ఎంపిగా గెలిచింది. కర్ణాటకలో సిని, రాజకీయ సంబంధాలు ఉన్న రమ్య అంబరీష్ భౌతిక ఖాయం చూసేందుకు రాలేదని ఆమె మీద కక్ష్య కట్టారు అంబరీష్ ఫ్యాన్స్.


నెటిజెన్స్ ట్రోలింగ్స్ తట్టుకోలేని ఆమె ప్రస్తుతం ఉన్న మ్యాండ్య లోని ఇల్లు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ట్రోలింగ్స్ ఎక్కువవడంతో పాటుగా తన ఇంటి చుట్టూ కూడా ఫ్యాన్స్ అల్లర్లు మొదలుపెట్టడంతో ఏకంగా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందట. కొన్నాళ్లుగా మ్యాండలోని ఆ ఇంట్లోనే ఉంటున్న రమ్య రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయడం హాట్ న్యూస్ గా మారింది.


అయితే కేవలం అంబరీష్ ఫ్యాన్స్ వల్లే కాదు కాంగ్రెస్ తరపున ఎంపి సీట్ ఆశించగా అందుకు అధిష్టానం అంగీకారం తెలుపలేదు. అందుకే ఈ ఒత్తిడి వల్ల ఆమె ఇల్లు ఖాళీ చేసిందని అంటున్నారు. ఏది ఎమైనా రమ్యకు గడ్డు కాలం మొదలైందని చెప్పొచ్చు. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అని చెప్పింది. ఇక ఇప్పుడు అమ్మడికి ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే అని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: