యంగ్ హీరోయిన్స్ హవా బాగా పెరిగి పోతున్న పరిస్థితులలో సీనియర్ హీరోయిన్స్ తమన్నా కాజల్ లకు టాప్ యంగ్ హీరోల నుండి అవకాశాలు చాల తక్కువగా వస్తున్నాయి. దీనితో వీరిద్దరూ తాము నటించే హీరోల స్థాయితో సంబంధం లేకుండా తమకు వస్తున్న అవకాశాలు అన్నీ చేజిక్కుంచు కుంటూ ఇండస్ట్రీలో కొనసాగడానికి  తమ వ్యూహాలు రచిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరూ తమ సినిమాలకు సంబంధించి లేటెస్ట్ గా జరిగిన మీడియా సమావేశాలలో ప్రవర్తించిన తీరును నిరసిస్తూ మీడియా వర్గాలు తమన్నా  కాజల్ లపై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా హీరోయిన్ గా నటించిన ‘నెక్స్ట్ ఏంటి’ మూవీ ఈ వారం విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను మీట్ ను మధ్యాహ్నం 12గంటలకు ఏర్పాటు చేస్తే ఆమీడియా మీట్ కు తమన్నా 3.45 లకు రావడం మీడియా వర్గాలకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు టాక్. 
Image may contain: 1 person, smiling, standing and outdoor
సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి టాప్ హీరోలు కూడ మీడియా సమావేశాలకు అంత ఆలస్యంగా రారని తన స్థాయికి మించి ఇగోను ప్రదర్శిస్తూ తమన్నా వ్యవహరించిన తీరుకు మీడియా వర్గాలు షాక్ అయినట్లు సమాచారం. ఇది చాలదు అన్నట్లుగా హీరోయిన్ కాజల్ ‘కవచం’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఏర్పాటు చేయబడ్డ మరో మీడియా మీట్ కు రెండు గంటలు ఆలస్యంగా వచ్చిందని తెలుస్తోంది. 

దీనితో ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోయిన్స్ కెరియర్ చెప్పుకోతగ్గ స్థాయిలో లేకపోయినా వీరిద్దరూ మీడియా పట్ల చూపించిన నిర్లక్ష్యం మీడియా వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. దీనితో కెరియర్ ఫేడవుట్ అవుతున్నా ఆవిషయాలు పట్టించుకోకుండా కాజల్ తమన్నాలు తమ స్థాయికి మించి ఇగోను ప్రదర్శిస్తున్నారు అంటూ మీడియా వర్గాలు వీరిద్దరి పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: