మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సంస్థతో భాగస్వామి అయి నిర్మించిన 'ఎఎంబి సినిమాస్' భాగ్యనగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలోని టాప్ మల్టీప్లెక్స్ థియేటర్లలో దీనికి స్థానం లభించడం హాట్ న్యూస్ గా మారింది. అత్యాధునిక టెక్నీలజీ వరల్డ్ క్లాస్ ఇంటీరియర్ డిజైన్స్ విలాసవంతమైన సౌకర్యాలతో మహేష్ నిర్మించిన ఈ మెగా మల్టీప్లెక్స్ వైపు టాలీవుడ్ సెలెబ్రెటీల దృష్టి పడటంతో ప్రస్తుతం ఇలాంటి ఆలోచనలు చాలామంది టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలకు ఏర్పడినట్లు సమాచారం. 
ఇప్పటికే పలు వ్యాపారాల్లో అల్లు అర్జున్
ఇది ఇలా ఉండగా తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ కూడ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే బన్నీ త్వరలోనే హైదరాబాద్‌లో మరో మెగా మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసే ఆలోచనలలో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 
సత్యం థియేటర్ స్థానంలో?
దీనికోసం ఏసియన్ సినిమాస్‌ కు చెందిన సునీల్ నారంగ్‌తో అల్లు అర్జున్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటున్నారు. డీల్ ఓకే అయితే అమీర్ పేటలో ఈ మెగా మల్టీప్లెక్స్ ఏర్పడే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. 
అల్లు అర్జున్ మూవీస్
తెలుస్తున్న సమాచారం మేరకు అమీర్ పేట ఏరియాలో ఒకప్పుడు అత్యంత ప్రముఖంగా ఒక వెలుగు వెలిగిన సత్యం ధియేటర్ స్థలంలో ఈ మెగా మల్టీ ప్లెక్స్ కాంప్లెక్స్ వస్తుందని అంటున్నారు. దీనితో క్రేజ్ విషయంలో బన్నీ మహేష్ తో పోటీ పడలేకపోతున్నా వ్యాపారాల విషయంలో అల్లు అర్జున్ మహేష్ తో పోటీ పడుతూ చెక్ పెడుతున్నారని అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: