తెలుగు, తమిళ ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే సుందరం మాస్టార్ అన్న స్థాయికి చేరుకోవడమే కాదు డ్యాన్స్ లో ఎన్నో రకాల ప్రయోగాలకు నాంది పలికారు సుందరం మాస్టార్.  పాత తరం, కొత్త తరం హీరోలకు ఆయా కాలానుగుణంగా స్టెప్పులు వేయించి మంచి పేరు తెచ్చుకున్నారు సుందరం మాస్టార్.  ప్రస్తుతం కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..రాజు, ప్రభుదేవ, ప్రసాద్ నా ముగ్గురు కొడుకులు నాకు సమానమే..ఎవరు ఎక్కువ..తక్కువ అని చెప్పలేను.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభుదేవ, రాజు బాగా రాణిస్తున్నప్పటికీ ముగ్గురు కలిసి నాతో ఆనందాన్ని పంచుకుంటారు. అయితే ఈ ముగ్గురిలో నాకు స్ఫూర్తి ప్రభుదేవానే అని చెబుతాను అన్నారు. 
Image result for prabhu deva brothers
ప్రభుదేవ చాలా కష్టపడి అన్ని రంగాల్లో తన ప్రతిభ చాటుకుంటున్నాడు.  టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సైతం తనదైన ముద్ర వేశాడు.  గతంలో " తెలుగులోని 'మనసంతా నువ్వే' సినిమా కన్నడ రైట్స్ తీసుకుని, నా ముగ్గురు కొడుకులతో నిర్మించాను.  కానీ ఆ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు..చివరికి నేనే ఓ మూడు చోట్ల నేనే రిలీజ్ చేశాను. చిత్రం బాగానే ఆడింది కానీ ఆ సమయంలో నేను పడ్డ కష్టాలు మాత్రం ఎవరూ ఊహించలేని విధంగా ఉన్నాయి.  అందుకే మళ్లీ నిర్మాణ రంగం వైపు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను.
Image result for prabhu deva brothers
డాన్స్ మాస్టర్ గా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిత్రాల్లో కూడా చిన్నచిన్న పాత్రలు పోషించాను. తమిళంలో ఎంజీఆర్, వైజయంతిమాలా జంటగా చేసే ఒక చిత్రంలో నాకు చిన్న వేషం వేసే అవకాశం వచ్చింది. మొదట నా డైలాగ్ టెస్ట్ చేసి చాలా బాగుందని మెచ్చుకున్నారు.  కానీ క్లాప్ కొట్టగానే నా నోట్లో నుంచి మాట రావడం లేదు...నోరంతా తడిసిపోయి..భయం వేసింది..దాదాపు 13 టేకులు తీసుకున్నాను. అప్పట్లో నా టైమ్ బాగుండి కరెక్ట్ డైలాగ్ పలికి ఉంటే..ఇప్పుడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని అయి ఉండేవాడిని అంటూ సరదాగా నవ్వారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: