తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలతో పోటీ పడుతు మంచి విజయాలు అందుకుంటున్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా అన్ని రంగాల్లో రాణిస్తున్న ధనుష్ ఆ మద్య 'మారి' భారీ విజయాన్ని అందుకున్నాడు. తాజాగా ‘మారి 2’ చిత్రంతో బిజీగా ఉన్నాడు ధనుష్. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలకి సిద్ధమైంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో ధనుష్ లుక్ అదిరిపోయింది. సన్నివేశాలు తమీళ తంబీలకి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. బాలాజీ మోహన్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. పక్కా ప్లానింగ్ తో ఈ చిత్రం షూటింగును చకచకా పూర్తి చేసేశారు. ధనుశ్ సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం సీక్వెల్ తెలుగులో మాస్ 2తో విడుదల కానుందని అంటున్నారు.
యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.. ఆయన సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల అవుతుంది.మారి' చిత్రాన్ని అప్పట్లో 'మాస్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 'మారి 2'చిత్రం తెలుగులో 'మాస్ 2' పేరుతో విడుదలయ్యే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది. మాస్ ఆడియన్స్ కి ఈ చిత్రం కనెక్ట్ అవుతుందనీ, తనకి మరో హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ధనుశ్ వున్నాడు.