అగ్గిపుల్లా..సబ్బు బిల్లా..కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు మార్కెటింగ్ వర్గాలు. ముఖ్యంగా బొమ్మల తయారీదారీలో కొత్త కొత్త డిజైన్లు..ఆశ్చర్యాన్ని కలిగింగచే విధంగా తయారు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ నటులకు సంబంధించి బొమ్మలు తయారు చేసి అందరినీ ఆకర్షిస్తున్నారు. పాపులర్ సెలబ్రిటీస్ బొమ్మలు మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. ఆ మద్య కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ తనయుడు తైమూర్ అలీ ఖాన్ బొమ్మలు కేరళలోని ఓ బొమ్మల దుకాణంలో దర్శనిమవ్వడం అందరికి షాకింగ్గా మారింది.
ఓ నెటిజన్ షాపులోని తైమూర్ బొమ్మను ఫోటో తీసి ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. ఈ బుడ్డోడికి అప్పుడే అంత ఫాలోయింగ్ ఉందా అంటూ ఖంగుతిన్నారు. తాజాగా ఇప్పుడు మరో బొమ్మ సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతుంది. ప్రియాంక, నిక్ జొనాస్ల బొమ్మలు దర్శనమిస్తున్నాయి. జోధ్పూర్కు చెందిన మనోజ్ చౌహాన్ అనే కళాకారుడు ప్రియాంక, నిక్ కలిసున్న మట్టి బొమ్మలను రూపొందించారు.
ప్రియాంక- నిక్ల వివాహం డిసెంబర్ 2న క్రైస్తవ సంప్రదాయంలో జరగగా, డిసెంబర్ 3న హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన రిసెప్షన్కి మోదీ కూడా హాజరయ్యారు.