తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. ఆ మద్య వచ్చిన ‘మహానటి’చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం రూపొందుతుంది. మహానటులు ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ఆయన సినీ ప్రస్థానం ‘మనదేశం’తో మొదలయ్యింది..అప్పటి నుంచి సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించడం కన్నా జీవించారని చెప్పొచ్చు.
ఆ తర్వాత తెలుగు జాతి గౌరవాన్ని కాపాడటానికి ‘తెలుగు దేశం’పార్టీని స్థాపించారు. రాజకీయాల్లో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొని ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో రెండు భాగలు..‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా రాబోతుంది. ఆయన సినీ నేపథ్యలో ముఖ్యమైన పాత్రలు ఏఎన్ ఆర్ గా సుమంత్, శ్రీదేవిగా రకూల్ ప్రీత్ సింగ్, సావిత్రిగా నిత్యామీనన్ ఇలా ఎంతో మంది నటీనటులు నటిస్తున్నారు. రాజకీయనేపథ్యంలో ఏపి సీఎం చంద్రబాబు గా రానా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మరో తెలుగమ్మాయి భాగం కాబోతుంది. గత కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈషా రెబ్బ ఆ మద్య ఎన్టీఆర్ అరవింద సమేత లో ఒక పాత్రలో కనిపించి పరవాలేధనిపించింది. ర్శకుడు క్రిష్ ఇటీవల బాలకృష్ణ - ఈషా రెబ్బ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి భాగంలో ట్విస్ట్ వచ్చే సమయంలో ఈషా క్యారెక్టర్ ఆకట్టుకుంటుందని టాక్.