రజినీకాంత్ ‘2.o’ అనుకున్న స్థాయిలో విజయం సాధించక పోవడంతో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయగల మూవీ ఇప్పట్లో ఏదీ లేదు అని అనుకున్నారు అంతా. అయితే రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే ప్రముఖ దర్శకుడు మణి రత్నం తీయబోతున్న ఒక భారీ మల్టీ స్టారర్ రాజమౌళి రికార్డులకు ఎర్త్ పెట్టే అవకాశం ఉంది అంటూ కోలీవుడ్ మీడియా మరొక సరికొత్త ప్రచారానికి తెర తీసి అందరికీ షాక్ ఇస్తోంది.
 విక్రమ్, విజయ్‌తో మణిరత్నం మల్టీస్టారర్
‘బాహుబలి’ తరువాత ప్రస్తుతం టాప్ దర్శకుల దృష్టి అంతా భారీ సినిమాల పై పడటంతో ఇప్పుడు మణిరత్నం కూడ అదే ప్రయోగం చేయబోతున్నాడు. కోలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ మణిరత్నం చాల సంవత్సరాల క్రితం తీసిన ‘దళపతి’  లాంటి స్థాయిలో ఉంటుందని ఈమూవీని తమిళ తెలుగు కన్నడ హిందీ మలయాళ భాషలలో  డబ్ చేయబోతున్నారని టాక్. 
 హీరో విక్రమ్, విజయ్ క్రేజ్‌తో
ఈ మూవీలో టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ హీరో మరో కీలక పాత్ర పోషించబోతున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. విక్రమ్ విజయ్‌లకు తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడ క్రేజ్ ఉన్న నేపధ్యంలో ఈమూవీని భారీ బడ్జెట్ తో తీసిన ‘బాహుబలి’ స్థాయిలో విజయం సాధించడం చాల సులువు అని మణిరత్నం అభిప్రాయం అని అంటున్నారు. 
ప్రముఖ నవల ఆధారంగా
ఒక ప్రముఖ రచయిత వ్రాసిన తమిళ నవల ఆధారంగా నిర్మింపబోయే ఈమూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ కన్నా ముందుగా విడుదల చేసి రాజమౌళికి షాక్ ఇవ్వాలన్న ఆలోచనలలో మణి రత్నం ఉన్నట్లు సమాచారం. ‘నవాబ్’ సక్సస్ తో జోష్ మీద ఉన్న మణి రత్నం త్వరలో మొదలు పెట్టబోతున్న ఈ భారీ మల్టీ స్టారర్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ కోలీవుడ్ మీడియా అప్పుడే ఊహాగానాలు మొదలు పెట్టేసింది



మరింత సమాచారం తెలుసుకోండి: