వంశధార క్రియేషన్స్ బ్యానర్పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం ‘కవచం’. చిత్రంలో శ్రీనివాస్ సరసన అందాల భామలు కాజల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలంటే ప్రేక్షకుల్లో కూడా ఓ అంచనాలు తెలియకుండానే వచ్చేసాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇది ఐదో చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. వరస ప్లాపుల తర్వాత ఇప్పుడు "కవచం"తో వస్తున్నాడు ఈ కుర్ర హీరో. దీని ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది.
ఈ చిత్రంలోని ‘‘దుల్హారా.. తుమ్హారా’’ వీడియో సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ లో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటోంది. హీరోహీరోయిన్ల మధ్య షూట్ చేసిన పలు రొమాంటిక్ సన్నివేశాలు పాటకు ప్రాణం పోశాయి. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో చిత్ర యూనిట్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ చిత్రంలో మొదటి సారిగా నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.
తనని చుట్టుముట్టిన సమస్యలను ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ చిత్రం కొనసాగుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ కథలో ఆడియన్స్ ఊహించని మలుపులు ఉంటాయి. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ చాలా చక్కగా కుదిరాయి..ఇక దీని బిజినెస్ లెక్కలన్నీ చాలా బాగున్నాయి. ఈ చిత్రం సేఫ్ జోన్లో ఉందని.. విడుదలకు ముందే లాభాలు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక హీరో, విలన్ మధ్య సాగే మైండ్ గేమ్తో ఈ చిత్రం తెరకెక్కింది.
ఇదిలా ఉంటే ఈ మసాలా ఎంటర్టైనర్ హిందీ డబ్బింగ్ హక్కులు 9 కోట్లకు.. శాటిలైట్ రైట్స్కు మరో 8 కోట్లు వచ్చాయి. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 7న ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదల కానుంది.