తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య యువ దర్శకులు ఒక్క చిత్రంతోనే తామేంటో నిరూపించుకుంటున్నారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి అంతా కొత్త నటులతో తీసిన ‘ఆర్ ఎక్స్ 100’ సూపర్ హిట్ అయ్యింది. కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించిన ఈ చిత్రం మొదట కాంట్రవర్సీ వచ్చిన...థియేటర్లలో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో కలెక్షన్ల పరంగా పెట్టిన పెట్టుబడికి పదింతలు ఎక్కువ రాబట్టింది.
ఈ సంవత్సరం హిట్ చిత్రాల్లో ‘ఆర్ ఎక్స్ 100’ చేరిపోయింది. తాజాగా అజయ్భూపతి ఇంట విషాదం నెలకొంది. అజయ్భూపతి తండ్రి వేగేశ్న రామరాజు(54) బుధవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాగా, రామరాజు కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. అజయ్ భూపతిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. 11 రోజుల పాటు ఆత్రేయపురం స్వగ్రామంలో నిత్య కర్మల్లో అజయ్ భూపతి పాల్గొంటారు.