ఈష్సా రెబ్బా మన తెలుగమ్మాయి. చాలాకాలం తరువాత తెలుగు తెరపై మెరిపిస్తున్న తెలుగందం. ఈషా. ఈ అమ్మాయికి అందమే కాదు. తెలివి కూడా ఉంది. అందుకే తొందరగా టాలీవుడ్లో అల్లుకుపోతోంది. అంతేంగా కోలీవుడ్,ఇతర భాషలలోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈషా రెబ్బా నటించిన లేటెస్ట్ మూవీ సుబ్రమణ్యపురం రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో దేవున్ని నమ్మే భక్తురాలిగా ప్రియా పాత్రలో కనిపించబొతోంది ఈషా


ఎన్నో అవకాశాలు ఇపుడు తనకు వస్తున్నాయని అంటున్న ఈషా తన కెరీర్ పై ధీమాగానూ ఆశగానూ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటించడం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతోంది.  అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నానని కెరీర్ ని  సీరియస్ గానే ప్లాన్ చేస్తున్నానని  లేటెస్ట్ మీడియా మీట్ లో తెలిపింది. 


తమిళం లో జీవి ప్రకాష్ కుమార్ సరసన ఓ చిత్రం లో నటిస్తున్నా... అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సరసన ఓ భారీ చిత్రం లో నటిస్తున్నానని ఇషా రెబ్బా ఇంటర్వ్యూలో వెల్లడించింది.  అంతేనా ఈషా రెబ్బా నటనను సీరియస్ గా తీసుకున్నానని చెబుతూ సక్సెస్ అన్నది మన చేతుల్లో లేదని, శ్రమ మాత్రం మనదే పడాలని అంటోంది.


ఇక ఈ తెలుగు భామకు టాలీవుడ్లో సినీ ప్రస్థానం పూర్తి సంత్రుప్తిగా ఉందంటోంది. మంచి చిత్రాలు, మంచి పాత్రలు నన్ను వరిస్తున్నాయి అని చెబుతున్న ఈషా రెబ్బ జూనియర్ ఎన్టీఆర్ సోదరిగా అరవింద సమేతలో చేయడానికి త్రివిక్రం, ఎన్టీఆర్ కారణమని చెప్పింది. అవకాశాలు వస్తే స్టార్ హీరోల పక్కన చిందులు వేస్తానంటున్న ఈ ముద్దు గుమ్మను టాలీవుడ్ ఎంతవరకు ప్రోత్సహిస్తుందో చూడాలి మరి


మరింత సమాచారం తెలుసుకోండి: