స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా కన్ ఫాం చేయలేదు. వక్కతం వంశీ డైరక్షన్ లో వచ్చిన నా పేరు సూర్య అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఆ సినిమా తర్వాత అసలైతే విక్రం కె కుమార్ డైరక్షన్ లో మూవీ ఉంటుందని వార్తలు రాగా ఆ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయిందని తెలుస్తుంది.


ఇక ప్రస్తుతం బన్ని త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేశాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మారుతి డైరక్షన్ లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట.


మారుతి, బన్ని మంచి స్నేహితులు అయినా సరే ఇన్నాళ్లు కలిసి సినిమా చేయలేదు. కాని ఇప్పుడు ఆ టైం వచ్చిందని తెలుస్తుంది. మారుతి చెప్పిన కథ బన్నికి నచ్చిందట. లైన్ ఓకే అవగా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకు రమ్మని చెప్పాడట. దాదాపు ఈ కాంబో మూవీ కన్ఫాం అయినట్టే. త్రివిక్రం సినిమా తర్వాత ఈ సినిమానే ఉంటుందని తెలుస్తుంది.


ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. వెంకటేష్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసిన మారుతి ఆ తర్వాత బన్నిని డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇద్దరి కాంబినేషన్ మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుందని చెబుతున్నారు. మరి బన్ని, మారుతి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: