రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ ఇద్దరి హీరోలకు సరితూగే విలన్ ని కూడా సెట్ చేస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమాలో క్రేజీ విలన్ ఉంటాడని అంటున్నారు.


ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. వార్తల్లో ఉన్న వారే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో కథానాయికలుగా ఫిక్స్ అయ్యారట. కియరా అద్వాని, కీర్తి సురేష్ ఇద్దరు హీరోయిన్స్ ట్రిపుల్ ఆర్ లో ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. భరత్ అనే నేనుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేస్తుంది.


ఇక కీర్తి సురేష్ కూడా నేను శైలజ, నేను లోకల్, మహానటి సినిమాలతో తన సత్తా చాటుకుంది. ట్రిపుల్ ఆర్ లో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడట రాజమౌళి. అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే లేటని అంటున్నారు. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో పోలీస్ గా చరణ్, బందిపోటు దొంగగా ఎన్.టి.ఆర్ కనిపిస్తారట.


బాహుబలితో ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డుల మోత మోగించిన రాజమౌళి మరోసారి అలాంటి హంగామా చేసేందుకే ట్రిపుల్ ఆర్ ను సిద్ధం చేస్తున్నాడు. చరణ్, ఎన్.టి.ఆర్ లు కూడా ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ గా తీసుకుని చేస్తున్నారు. 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: