వెండి తెర మహర్షి మహేష్ యమ స్పీడ్ గా మూవీ చేసేస్తున్నాడు. 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ కాలేజ్ స్టూడెంట్ గా కిర్రాకు పుట్టిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ చూస్తే చాలా వరకూ షూటింగ్ ఫినిషి అయిందంటున్నారు. సాంగ్స్ బాలన్స్ తో పాటు కొంత యాక్షన్ పాట్, కొన్ని సీన్లు ఉన్నాయి. ఈ మూవీని 2019 సమ్మర్ గిఫ్ట్ గా తెర ముందుకు తెస్తున్నారు. ఈ మూవీ సంగతి పక్కన పెడితే మహేష్ నెక్స్ట్ ఏంటి అన్నది ఇపుడి హాట్ టాపిక్ అయింది.


మహేష్ తరువాత మూవీకి ఇద్దరు టాప్ డైరెక్టర్లు కర్చీఫ్ వేసేసి కధలు వండేస్తున్నారు. మహేష్ తో అపుడెపుడో నెనొక్కడినే మూవీని తీసిన సుకుమర్ తో తరువాత మూవీ ఉంటుందని ఓ వైపు ప్రచారం సాగుతోంది. అలా కాదు, రెండు హిట్లు ఇచ్చిన కొరటాల శివతో హ్యాట్రిక్ మూవీని మహేష్ చేయబోతున్నారని కూడా చెబుతున్నారు. ఈ ఇద్దరూ కూడా మహేష్ కోసం సూపర్ డూపర్ కధలు వండేసి రెడీగా ఉన్నారట.


ఇక సుకుమార్ ఐతే మరి కాస్తా ముందుకెళ్ళి హీరోయిన్ సెలెక్షన్ కూడా చేసేశారట. మహేష్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసినట్లుగా టాక్ నడుస్తోంది. అయితే స్పైడర్ మూవీలో కనిపించిన ఈ జోడీకి అంతగా మార్కులు పడలేదు. పైగా మూవీ కూడా ఫ్లాప్ అయింది. మరి ఆ కాంబోను మళ్ళీ రిపీట్ చేసేందుకు మహేష్ ఒప్పుకుంటాడా అన్నది ఇపుడు టాపిక్ గా ఉంది. 


అయితే స్టోరీ డిమాండ్ చేస్తోందని, హీరోయిన్ గా తన కధకు రకుల్ కరెక్ట్ అని సుకుమార్ అంటున్నట్లు చెబుతున్నారు. తన స్టోరీపైనా, హీరోయిన్ పైనా ఫుల్ కాంఫిడెంట్ గా ఉన్న సుక్కూ మహేష్ తో నెక్స్ట్ మూవీని తానే చేయబోతున్నారా, లేక కొరటాల మధ్యలోకి వస్తారా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. మహేష్ మాత్రం రెండు మూవీస్ చేయడం ష్యూర్ అంటున్నారు. మరి ఏది ఎపుడన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: