అక్కినేని ఫ్యామిలీ నుండి కింగ్ నాగార్జున తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య మొదటి సినిమా జోష్ అంతగా ఆకట్టుకోలేదు కాని ఆ తర్వాత వచ్చిన ఏమాయ చేసావే సినిమా సూపర్ హిట్ ఇచ్చింది. లవర్ బోయ్ ఇమేజ్ వచ్చిన చైతుకి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేసి కావాలని కెరియర్ ను రిస్క్ లో పడేసుకున్నాడని చెప్పొచ్చు.


రారండోయ్ వేడుక చూద్దాం హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్ని మళ్లీ నాగ చైతన్యను నిరాశ కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇయర్ వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే చైతు ఇకనుండి స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారట.


ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో మజిలి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో సమంతతో జోడీ కడుతున్నాడు నాగ చైతన్య. రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ లో అది కూడా పెళ్లైన తర్వాత మొదటిసారి చేస్తున్న సినిమా కావడంతో మజిలి మీద అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాతో పాటుగా బాహుబలి రైటర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కథా చర్చలు జరుపుతున్నాడట నాగ చైతన్య.


తనకో హిట్టు సినిమా సబ్జెక్ట్ కావాలని అంటున్నాడట. ఆల్రెడీ చైతు ఇమేజ్ కు తగిన సబ్జెక్ట్ ఒకటి డిస్కస్ చేశారట కూడా. ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. నాగార్జున తనయుడిగా సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా అక్కినేని వంశ పరువుని కాపాడేందుకు చైతు పడే కష్టాలు అన్ని ఇన్ని కావట. మరి మనోడికి హిట్టు సినిమా సబ్జెక్ట్ దొరికి ఆడియెన్స్ ను అలరించే హిట్ కొట్టాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: