తెలుగు సినిమా రంగాన్ని తన సినిమాల బ్లాకు బస్టర్ హిట్స్ తో షేక్ చేసిన దర్శ కేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ రోజున ఊహించని చేదు అనుభవం ఎదురైంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం రాఘవేంద్రరావు ఫిలింనగర్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌ కు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే క్యూ లైన్‌లో నిలబడకుండా ఓటు వేసేందుకు ఆయన ముందుకు వచ్చారు. దీనితో క్యూలో ఉన్నవారు అభ్యంతరం తెలిపినట్లు టాక్. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన రాఘవేంద్రరావు ఓటు వేయంకుండానే వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

సామ్యానులకైనా సెలబ్రిటీలకైనా ఒకే రూల్స్ వర్తిస్తాయని ఆ క్యూలో నుంచున్నవారు అభిప్రాయ పడటంతో ఈ అనుకోని సంఘటన జరిగినట్లు సమాచారం. అంతేకాదు  
నాగార్జున అల్లు అర్జున్ చిరంజీవి జూ.ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీలు మాత్రం రూల్స్‌ ను ఫాలో అయి క్యూలైన్‌ లో నిలబడి ఓటు వేసిన పరిస్థితులలో అలాంటి సంప్రదాయమే పాటించాలి అంటూ కొందరు కామెంట్స్ చేయడంతో ఈ అనుకోని సంఘటన జరిగినట్లు టాక్. 

ఇది ఇలా ఉంటే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల లాంటి ప్రముఖులకు కూడ ఓట్లు గల్లంతు కావడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. బంజారాహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాలఓటర్ల జాబితాలో తన పేరు లేదన్న విషయాన్ని తెలుసుకుని గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని ఇప్పుడు ఎందుకు లేదనీ ఆమె ప్రశ్నించినా సరైన సమాధానం దొరకకపోవడంతో ఆమె కూడ అసహనంతో వెనుతిరిగి వెళ్లిపోయింది. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల మధ్య తెలంగాణ రాష్ట్ర పోలింగ్ కొనసాగుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: