ఈమధ్య కాలంవరకు యూత్ కు క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగువెలిగిన రకుల్ ప్రీత్ టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలు అందరితోను నటించింది. అయితే అనూహ్యంగా చాలామంది టాప్ యంగ్ హీరోలు రకుల్ ప్రీత్ తో తిరిగి మళ్ళీమళ్ళీ నటించడానికి పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. దీనికి కారణం ఈమెకు ప్రస్తుతం పడిన ఐరన్ లెగ్ ముద్ర. ఇలాంటి పరిస్థుతులలో రకుల్ ప్రీత్ కోసం దర్శకుడు సుకుమార్ చేస్తున్న రాయబారాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తి అవుతున్న నేపధ్యంలో సుకుమార్ ప్రస్తుతం అతడి సినిమాకు సంబంధించిన కథను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మొదట్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకపోరాట యోధుడి కథను సినిమాగా తీద్దామని అనుకున్న సుకుమార్ ఇప్పుడు మహేష్ సూచనలతో తన ఆలోచనలు మార్చుకుని ఒక మైండ్ గేమ్ చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నట్లు సమాచారం. 

ఈకథ మహేష్ కు నచ్చడంతో ఈకధకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు జరుగుతోంది అని తెలుస్తోంది. ఈమూవీని చాలవేగంగా తీయాలి అన్న పట్టుదలతో ఉన్న సుకుమార్ ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో హీరోయిన్ పాత్రకు రకుల్ పేరును సుకుమార్ సూచించినట్లు అయితే ఆ సూచనకు మహేష్ అంతగా ఆసక్తి కనపరచనట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం మహేష్ కు రకుల్ తో నటించిన ‘స్పైడర్’ అనుభం అని అంటున్నారు. అయితే సుకుమార్ గతంలో దర్శకత్వం వహించిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో రకుల్ బాగా నటించింది అన్న అభిప్రాయంతో తన కథకు మహేష్ పక్కన రకుల్ అన్ని విధాల సరిపోతుందని అనే అభిప్రాయంలో ఉన్నట్లు టాక్. దీనితో ఈవిషయమై సుకుమార్ చేస్తున్న ఒత్తిడిని కాదనలేక చివరకు రకుల్ ప్రీత్ కు మహేష్ ఓకె చెప్పే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: