అన్న గారి కుటుంబం అంటేనే అందరికీ ఆసక్తి. అభిమానం. తెలుగు లోగిళ్ళలో అతి పెద్ద కుటుంబం అన్న గారిది. ఆయన కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా అల్లుళ్ళు, కోడల్లు ఇలా చాలా మంది ఉన్నారు. అన్న గారు లేకపోయినా ఆయన జనం గుండెల్లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబంలోనే అన్న గారిని జనం చూసుకుంటున్నారు. ఆ కుటుంబంలో అంతా కలసి చల్లగా ఉండాలని ప్రతి తెలుగు వాడూ కోరుకుంటాడన్నది నిజం.


ఇకపోతే అన్న గారి జీవిత చరిత్రతో తీస్తున్న  ‘ఎన్టీఆర్’ మూవీకి సంబంధించి ఆడియో వేడుక ఈ నెల మూడవ వారంలో తిరుపతిలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా అన్న గారి కుటుంబం మొత్తం వస్తారని అంటున్నారు. అంటే పైన చెప్పిన మొత్తం సభ్యులన్న మాట. ఇలా ఎందరు వచ్చినా జూనియర్ ‘ఎన్టీఆర్’ వస్తాడా. బాలయ్యతో వేదిక షేర్ చేసుకుంటాడా అన్న టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే బాబాయి. అబ్బాయి ల మధ్యన అంతగా సఖ్యత లేదని టాక్ ఉంది కాబట్టి. 


అయితే హరిక్రిష్ణ చనిపోయాక అవన్నీ మాసిపోయాయని, ఇపుడు అంతా ఒక్కటేనని కూడా అంటున్నారు. పైగా బాలయ్య ఇపుడు జూనియర్ ‘ఎన్టీఆర్’ పట్ల మునుపటి కంటే ఎక్కువ అభిమానంతో ఉన్నారని కూడా అంటున్నారు. జూనియర్ సైతం తన కుటుంబంతో కలసిపోవాలని తహ తహలాడుతున్నారని చెబుతున్నారు. 
మరి ఇదంతా చూస్తూంటే అన్న గారి కుటుంబం ఒక్కటిగా గ్రూప్ ఫొటో ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నట్లుగా అనిపించడంలెదూ. ఆ ముచ్చట చూసేందుకు రెండు కళ్ళు కూడా చాలవుగా అంటున్నారు. . మరి బాలయ్య, అబ్బాయిలు జూనియర్ ‘ఎన్టీఆర్’, కళ్యాణ్ రాం వంటి వారంతా కలసిన ఈ వేడుక చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని ‘ఎన్టీఆర్’ ఫిల్మ్ యూనిట్ చెబుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: