జబర్ధస్త్ లో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ప్రముఖ దర్శకులు సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయకు మంచి పేరు వచ్చింది. దాంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో రూపొందుతున్న మూవీ ‘ఎఫ్2’. ఈ చిత్రంలో అనసూయ స్పెషల్ డ్యాన్స్ చేయబోతుందని వార్తలు వచ్చాయి.
తాజాగా దీనిపై చిత్ర దర్శకుడు తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘f2’లో అనసూయ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక గీతంలోనూ కనిపించనున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనికి అనసూయ ప్రతిస్పందించారు. ‘నన్ను తీసుకున్నందుకు ధన్యవాదాలు డైరెక్టర్ సర్. మీరు నా ఆకాంక్షను తీర్చారు’ అని సమాధానం ఇచ్చారు.
మల్టీ స్టారర్గా రూపొందుతున్న ఎఫ్ 2 సినిమాలో వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్కు జోడీగా మెహరీన్ కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సినిమాను నిర్మించాడు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఈ నెల 12న విడుదల కానుంది. బుల్లితెరతో ప్రేక్షకులకు చేరువైన అనసూయ, పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో ఆడిపాడి అలరించింది. ఈసారి ఆమె వెంకీ, వరుణ్లతో కలసి సందడి చేయబోతున్నారు. అనిల్ రావిపూడి వరుస హిట్లు కొడుతుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.